స్కూల్ ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరు చిన్నారులు మృతి

-

హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్‌ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ఆరుగురు పాఠశాల విద్యార్థినులు ఈసీఐఎల్‌ నుంచి చర్లపల్లి వైపు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆటో డ్రైవర్‌ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉదయాన్నే స్కూల్ కి వెళ్లిన పిల్లలు విగత జీవులుగా ఇంటికి రావడం చూసి మృతుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారి రోదనలు చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news