మలక్ పేటలో మంత్రి పొన్నం.. డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలన!

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. శనివారం మలక్‌పేట నియోజకవర్గం సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెలులో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించి, పెండింగ్ పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చంచల్‌గూడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని పరిశీలించారు. మంత్రితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, తదితర ఉన్నతాధికారులు సైతం ఆయన వెంట ఉన్నారు.

ఇదిలాఉండగా, సీఎం రేవంత్ ప్రభుత్వంలో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆ దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.ప్రజాపాలనలో ఇంటి కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అర్భన్ పరిధిలో 23.5 లక్షలు, రూరల్‌లో 58.5 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news