వాహనాలపై దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

-

ఓ కారు సృష్టించిన బీభత్సానికి ఓ కుటుంబం బలైన ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో చోటుచేసుకుంది. నగరంలోని సక్కర్దార వంతెనపై వేగంగా వస్తున్న ఓ కారు అదే దారిలో వస్తున్న వాహనాలపైకి దుసుకెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

నిందితుడు గణేశ్​ అధావ్ తన స్నేహితుని కారు తీసుకుని బుట్టిబోరినికి వెళ్తున్నాడు. బ్రిడ్జ్​పై ఎవరూ లేరని భావించి కారు స్పీడ్‌ని పెంచాడు. మితిమీరిన వేగంతో ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను వరుసగా ఢీకొట్టాడు. అందులో ఓ బైక్​పై ఒక వ్యక్తి, అతని తల్లి, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు.​ కారు ఢీకొట్టడం వల్ల వారు వంతెనపై నుంచి కింద పడిపోయారు. నీటిలో పడిపోయిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news