బ్రేకింగ్: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు..!!

-

సీనియర్ నటుడిగా, రాజకీయవేత్తగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం 3:25 గంటలకు ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ప్రభాస్ అభిమానుల సైతం తీవ్రంగా తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తండ్రి సూర్యం రాజు మరణించడంతో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మారారు కృష్ణంరాజు. ఇక ప్రస్తుతం ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా పోయిందని పలువురు తమ బాధను తెలియజేస్తున్నారు..

ఇక కృష్ణంరాజు మరణ వార్త విని అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఇప్పటికే తన పెదనాన్నను చూసుకోవడానికి ప్రభాస్ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో ఏ ఐ జి హాస్పిటల్ లో చేరిన కృష్ణంరాజు ఇలా తుది శ్వాస విడిచి విగత జీవిగా బయటకు రావడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి.. ప్రేక్షకులను బాగా మెప్పించిన ఈయన రాజకీయ నాయకుడిగా కూడా చెరగని గుర్తింపును సొంతం చేసుకున్నారు. కథానాయకుడిగా విలన్ గా నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

రాజకీయరంగంలో కూడా రెండుసార్లు లోకసభ ఎన్నికలలో ఎంపికయి, ఆ తర్వాత చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ లో చేరారు. ఇక అక్కడ పోటీపడినా ఓడిపోవడం జరిగింది. ఇకపోతే కృష్ణంరాజు చివరిసారిగా నటించిన సినిమా పాన్ ఇండియా మూవీ అయినటువంటి రాధేశ్యామ్.. ఇక ఈ సినిమా పెద్దగా హిట్టు కాకపోయినా కలెక్షన్ పరంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇదిలా వుండగా ప్రస్తుతం కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news