రాహుల్ గాంధీ “భారత్ జోడో” యాత్రలో దొంగల హల్ చల్

-

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ” భారత్ జోడో”యాత్ర లో జేబు దొంగలు హల్చల్ సృష్టించారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు వేలాదిమంది పాల్గొంటున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పెద్ద ఎత్తున ప్రజల రాకను అవకాశం గా మలుచుకొని వారిలో కలిసిపోతూ పిక్ పాకెటింగ్ కి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని కేరళలోని కరమణ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఇటీవలి మూడు రోజుల్లో యాత్ర కొనసాగిన ప్రాంతాలలో జేబు దొంగతనం కేసులు నమోదయ్యాయని తెలిపారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు సంబంధిత ఘటనలు జరిగిన ప్రదేశాలలో సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. నలుగురు ముఠా సభ్యుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. రాహుల్ గాంధీతో ఫోటోలు దిగేందుకు ప్రజలు గుమిగూడుతున్న సమయంలో వారి జేబులను కత్తిరిస్తున్నారు దొంగలు. అయితే తమ ఫోన్లు పోయాయని కొందరు నేతలు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో దుండగులను పట్టుకునేందుకు మఫ్టీలో ప్రత్యేక బలగాలని ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news