దసరాకు ఓటీటీలో సందడి చేయనున్న “రంగ రంగ వైభవంగా”..

-

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్. అయితే తన డెబ్యూ ఫిలిం ఉప్పెన సినిమాతో యూత్ ను ఆకట్టుకున్నాడు .. ఆ తరువాత ‘కొండ పొలం’తో మాస్ ఆడియన్స్ కి చేరువయ్యాడు వైష్ణవ్ తేజ్. ఆయన మూడో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ రూపొందింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్.

తమిళంలోకి ‘అర్జున్ రెడ్డి’ని రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో వైష్ణవ్ జోడీగా కేతిక శర్మ అందాల సందడి చేయనుంది. ఈ నెల 2వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయగా మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓడిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. దసరా కానుకగా అంటే అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news