మహబూబ్ నగర్ లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 335 గొర్రెల మృతి

-

తెలంగాణలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కౌకుంట్లలో రైలు ఢీకొని ఒకేసారి 335 గొర్రెలు మృతి చెందాయి. మూగజీవాలను కుక్కలు తరమడంతో భయపడి ఒక్కసారిగా రైలు పట్టాల పైకి వెళ్లాయి.

కాగా, అదే సమయంలో అటుగా వచ్చిన రైలు గొర్రెలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 335 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. చనిపోయిన మూగజీవాల విలువ రూ. 33.5 లక్షల మేర ఉంటుందని బాధితులు పేర్కొన్నారు.

వాటి మీదే ఆధారపడి జీవించే బాధితులు, ఈ ఘటనతో లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే, అక్టోబర్ నెలలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి కోల్కత్తా వెళ్తున్న ఎక్స్ప్రెస్ కింద పడి ఏకంగా 400 గొర్రెలు మృతి చెందాయి.

Read more RELATED
Recommended to you

Latest news