మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా : ఎమ్మెల్యే సీతక్క

-

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. మునుగోడు ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే.. ఈరోజు మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ వేశారు. అయితే.. అయితే పాల్వాయి స్రవంతిని గెలిపించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క ప్రచారం మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా దోపిడీ చేస్తున్న టీఆర్‌ఎస్‌, బీజేపీలను మునుగోడు పొలిమేరలదాకా తరిమికొట్టండని ఆమె అన్నారు. ఆడబిడ్డను దీవించి గెలిపించండని ఆయన కోరారు.

పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే సమ్మక్క సారక్కల్లా ప్రజా సమస్యల కోసం  పోరాడతాం: మునుగోడులో సీతక్క | MLA seethakka interesting comments in munugode  campaign to win palvai ...

అసెంబ్లీలో అడబిడ్డలం మేమిద్దరం పులి బిడ్డలై గర్జించాలంటే.. స్రవంతిని గెలిపించండని ఆమె వ్యాఖ్యానించారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించండని ఆమె అన్నారు. పుట్టుక నుంచి చావు దాకా జీఎస్టీ పేరుతో పేదలపై బీజేపీ భారం మోపుతోందని, ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆమె విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయి మునుగోడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ ఎన్నిక ఒక పునాదిలాంటిదని ఆమె వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం మీ ఆడబిడ్డకు ఇవ్వండి..నాకు తోడుగా అసెంబ్లీకి పంపండని సీతక్క కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news