భార్యకు మొబైల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఈఎంఐలో కొన్నాడని మహిళ ఆత్మహత్య

-

ఖరీదైన మొబైల్ కొనివ్వమని ఓ మహిళ తన భర్తను అడిగింది. భార్య కోరికను కాదనలేకపోయాడు ఆ వ్యక్తి. కానీ తన దగ్గర మొబైల్ కొనే అంత డబ్బు లేదు. తాహతుకు మించి ఖరీదైన మొబైల్ కొనాలంటే కష్టమే. కానీ భార్య అడిగింది కదా అని కాదనలేకపోయాడు. అందుకే ఈఎంఐలో తన భార్యకు ఇష్టమైన ఫోన్ కొన్నాడు. కానీ తను ఈఎంఐలో మొబైల్ తీసుకున్నాడని ఆగ్రహించిన ఆ మహిళ క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని మల్కాన్ గిరిలో చోటుచేసుకుంది.

కలిమేలా బ్లాక్​కు చెందిన జ్యోతి, కనైకు ఏడాది క్రితం వివాహమైంది. జ్యోతికి కనై ఈఎంఐలో మొబైల్ కొన్నాడు. ఈఎంఐలో ఫోన్ కొన్న విషయం తన భార్య జ్యోతికి చెప్పలేదు. అన్ని వాయిదాలు చెల్లించిన తర్వాత ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి ఒక డాక్యుమెంట్‌పై సంతకం కోసం కనై ఇంటికి వచ్చాడు. అప్పుడు తన భర్త ఈఎంఐలో ఫోన్ కొనుగోలు చేసినట్లు జ్యోతికి తెలిసింది. భర్త ఇంటికి రాగానే జ్యోతి అతడితో వాగ్వాదానికి దిగింది. మనస్తాపానికి గురై క్షణికావేశంలో విషం తాగేసింది. ఈ ఘటనతో కలత చెందిన కనై స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే దంపతులిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news