మునుగోడు ఉపఎన్నిక వేళ.. లిబర్టీ చౌరస్తాలో భారీ నగదు పట్టివేత

-

మునుగోడు ఉపఎన్నిక వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో పోలీసు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గానికి వెళ్లే మార్గాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రేపు పోలింగ్ జరగనున్న క్రమంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు రూ. కోటి 27 లక్షలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ బైక్ ని వెంబడించారు. అనంతరం తనిఖీ చేయగా.. వారి వద్ద కోటి రూపాయలకు పైగా నగదు పట్టుబడినట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగదుతో పాటు గోల్నాకలో నివాసముండే మన్నె శ్రీనివాస్‌, ఉస్మాన్‌గంజ్‌కు చెందిన విశ్వత్‌శెట్టి, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఫణి కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news