నేడు విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ..షెడ్యూల్ ఇదే

-

నేడు విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే, ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు గవర్నర్‌ బిశ్వభూషన్‌, సీఎం వైఎస్‌ జగన్. అనంతరం మారుతి జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ప్రధాని మోడీ రోడ్ షో జరుగనుంది.

30 వేల మంది కార్యకర్తలు, ఉత్తరాంధ్ర కళాబృందాలతో ప్రధాని మోడీకి స్వాగతం పలకనుంది బీజేపీ నాయకత్వం. ఇక ప్రధాని మోడీ రాకతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రధాని మోదీతో ఇవాళ విశాఖలో భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఇక అటు ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ..విశాఖ బంద్‌ కు పిలుపునిచ్చాయి వామపక్షాలు.

Read more RELATED
Recommended to you

Latest news