అగ్ని ప్రమాద ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి..రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటన

-

తాడేపల్లిగూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకేన్న సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం (మం) కడియుద్దలో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి  పైగా మరణించినట్టు సమాచారం. అయితే, తాడేపల్లిగూడెంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం.. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news