మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. కార్యకర్తల నినాదాలు

-

ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొంపల్లిలోని బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు సంతోష్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు తలుపులు తెరిచేందుకు నిరాకరించారు. దీంతో మధ్యాహ్నం తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేయడంతో.. సంతోష్ రెడ్డి కుటుంబసభ్యులు తలుపులు తెరిచారు. ప్రస్తుతం సంతోష్ ఇంట్లో ఐడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Revanth harassing me since long: Malla Reddy

సోదాల కారణంగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఇంటి నుంచి బయటకు రాలేదు. దాదాపు 10 గంటలకు పైగా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 50 చోట్ల ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకులు, అల్లుళ్ల నివాసాలతో పాటు .. మల్లారెడ్డి తమ్ముళ్లు, బంధువుల ఇండ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. సాయంత్రం తర్వాత బయటికి వచ్చిన మల్లారెడ్డి వద్దకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మల్లారెడ్డిగా మద్దతుగా నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news