తనపై బ్యాన్ అంటున్న వారిపై విరుచుకుపడ్డ రష్మిక..!!

-

హీరోయిన్ రష్మిక కర్ణాటక స్వంత రాష్టం అని అందరకీ తెలిసిందే. మొదట కన్నడ నుండి తెలుగుకు వచ్చి మెల్లిగా ఒక్కో సినిమా చేసుకుంటా పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లి పొయింది. ఇక అమ్మడి చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పడు కర్నాటక లో కాంతారా సినిమా విషయంలో రస్మిక మీద విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక ఆమె సినిమాలను బ్యాన్ చేయాల్సిందిగా టాక్ నడుస్తోంది.

వాస్తవానికి ఈ వివాదం కాంతారా కంటే మొదలయ్యింది అంటారు. కాంతారా తీసిన రిషబ్ శెట్టి రష్మిక ను తన సినిమా కిర్రిక్ పార్టీ ద్వారా పరిచయం చేసాడు. ఆ సినిమా తర్వాత ఆమె అతనితో మాట్లాడకుండా కృతజ్ఞతలు కూడా చూపించ లేదట. రిషిబ్ శెట్టి తీసిన కాంతారా సినిమాని అందరూ పొగుడుతున్నా కాని, కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఇప్పటివరకు సినిమా చూడలేదని తాపీగా చెప్పడంతో కన్నడ ప్రజలు మండి పడుతున్నారు. అదీ కాక ఫేమ్ వచ్చిన తర్వాత కన్నడ సినిమా వైపు చూడటం లేదని ఆమె పై కోపంతో ఉన్నారట. దీనితో ఆమెను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నారట. అయితే ఈ వివాదం మీద రస్మిక తాజాగా వివరణ ఇచ్చింది.

కాంతర సినిమా వివాదం గురించి కూడా మాట్లాడుతూ మీడియా వాళ్ళు నన్ను ఈ ప్రశ్న అడిగినప్పటికీ నేను నిజంగానే ఈ సినిమా చూడలేదు అందుకే చూడలేదని చెప్పాను.సినిమా చూసిన తర్వాత సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ చిత్ర బృందానికి కంగ్రాట్స్ అని మెసేజ్ కూడా పెట్టానని వాళ్లు కూడా థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారని తెలిపారు. కాని చాలా మంది దీన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని నామీద దాడి జరిగేలా చేశారు. ఇక నా మీద వచ్చే ప్రతి విషయం పై వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళలేను. నా కంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి అని స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్ఛింది.

 

Read more RELATED
Recommended to you

Latest news