Breaking : కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక

-

తీవ్ర ప్రభావం చూపుతున్న మాండుస్‌ తీవ్ర తుపాను ఈ సాయంత్రం నుంచి ఏపి దక్షిణ కోస్తా జిల్లాలపై పంజా విసరనుంది. నేటి అర్థరాత్రి తుపాను తీరం దాటనుంది. మాండుస్‌ ప్రభావం ఏపిలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. కృష్ణపట్నం పోర్టు వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అదే సమయంలో అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

Andhra Pradesh gets India's longest electrified rail tunnel. Key features |  Mint

 

ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. మాండుస్‌ తీరం దాటిన తర్వాత నెల్లూరుతో పాటు చిత్తూరు తదితర రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news