BRS లో చేరిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే

-

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన, అధినేత సిఎం కేసీఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ, దేశ రాజకీయాల్లో వో సంచలనంగా మారింది. జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసిన బిఆర్ఎస్ పార్టీ గుణాత్మక జాతీయ విధానాలు, ఇప్పటికే పలువురు రాజకీయ వేత్తలను, మేథావులను ఆకర్షిస్తున్నవి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇందులో పలువురు సీనియర్ రాజకీయ నేతలు మేథావులు ప్రజాక్షేత్రంలో పనిచేసే పలువురు ప్రముఖులున్నారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నాడు బిఆర్ఎస్ జాతీయ పార్టీ గా, అధికారికంగా ఆవిర్భవించిన కొన్ని గంటల్లోనే పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి. అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ పార్టీ నేపథ్యం వున్న ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి సీనియర్ రాజకీయవేత్త చల్లా వెంకట్రామిరెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ గారు, గులాబీ కండువా కప్పి, చల్లా’ ను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా…మంత్రి హరీశ్ రావు, తదితరులున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news