మేము నాలుగు పార్టీలు మారి రాలేదు – దామోదర రాజనర్సింహ

-

నాలుగు పార్టీలు మారి వచ్చిన చరిత్ర మాది కాదన్నారు కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్ లోనే పుట్టామని, కాంగ్రెస్ లోనే పెరిగామని, కాంగ్రెస్ లోనే చేస్తామని స్పష్టం చేశారు. పీసీసీ కమిటీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళకి గుర్తింపుని ఇచ్చారని మండిపడ్డారు. అంటే దీనిని బట్టి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ఏం సంకేతం ఇస్తున్నారని మాకి అనుమానం వస్తుందన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పార్టీకి మంచిది కాదన్నారు. సోషల్ మీడియా ద్వారా కోవర్టులు అని పోస్టులు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీ కార్యకర్తలకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే వారిని కాపాడే దిశగా తమ ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిని, పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news