తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి సంక్షోభం లేదు..అన్ని క్లియర్‌ – దిగ్విజయ్‌

-

తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి సంక్షోభం లేదు..అన్ని క్లియర్‌ అని కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లోని అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలన్నారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడండి.. బహిరంగ ఆరోపణలు వద్దని వార్నింగ్‌ ఇచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు దిగ్విజయ్ సింగ్. మరో మారు ఇలాంటివి పునరావృతం కావొద్దని హెచ్చరించారు. అలా జరిగితే ఎంత పెద్ద నాయకుడైనా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీతో ప్రజలు విసిగిపోయారు.. అన్ని సెటిల్ అవుతాయి.. కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉంటేనే బీఆర్ఎస్‌, బీజేపీని ఎదుర్కోగలమని స్పష్టం చేశారు దిగ్విజయ్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news