BREAKING : విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ !

-

సిబిఐ మాజీ జెడి వీవీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారుండరు. వాసగిరి లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లాకు చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. డిఐజి హోదా లో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యూటేషన్ పై వెళ్లి సిబిఐ లో బాధ్యతలు చేపట్టారు. సిబిఐ డిఐజి గా 2006 జూన్ లో సొంత రాష్ట్రమైన హైదరాబాద్ లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సిబిఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డైరెక్టర్.

అయితే, ఆయన రిటైర్మెంట్‌ అయ్యాక, జనసేనలో చేరి..ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే, తాజాగా సిబిఐ మాజీ జెడి వీవీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ మాజీ జెడి వీవీ లక్ష్మీనారాయణ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ సభ్యునిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్వచ్ఛంద సంస్థ జాయిన్ ఫర్ డెవలప్మెంట్ జెడి సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పలు పార్టీలు జేడీ లక్ష్మీనారాయణకు ఆహ్వానం పలికాయని కానీ సిద్ధాంతాలు కలవకపోవడం వల్ల ఏ పార్టీలోను చేరకూడదని నిర్ణయించుకున్నారని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news