న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవద్దు : రాజాసింగ్ కీలక ప్రకటన

-

 

న్యూ ఇయర్ వేడుకలపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ యువతకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 రాగానే యువత రోడ్లపైకి వచ్చి వేడుక చేసుకుంటారు.

మన నూతన సంవత్సరం డిసెంబర్ 31న కాదు. ఆ రోజు సెలబ్రేషన్స్ చేసుకోవద్దు. మన నూతన సంవత్సరాది ఉగాది. న్యూ ఇయర్ బ్రిటీషర్ల సాంప్రదాయం. వాళ్లు మనల్ని 2 ఏళ్ళు బానిసలుగా చూశారు. మన సాంస్కృతిని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

కాగా, ప్రసుతం హైదరాబాద్ వాసుల్లో న్యూ ఇయర్ జోష్, నెలకొంది. అయితే న్యూ ఇయర్ నేపథ్యంలోనే పోలీసులు కొన్ని కఠిన నియమ నిబంధనలను అమలు చేస్తున్నారు. 31 రాత్రి నుంచి జనవరి 1న తెల్లవారుజాము వరకు నెక్లెస్ రోడ్, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డులతోపాటు ఫ్లై ఓవర్లు మూసివేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news