రాత్రి 10 దాటితే మ్యూజిక్ పెట్టొద్దు.. పబ్ లకు హైకోర్టు వార్నింగ్

-

న్యూ ఇయర్ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ వినిపించద్దని వార్నింగ్ ఇచ్చింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సౌండ్లు పెట్టవద్దని సూచించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మరోసారి నిర్వహకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నేడు పబ్ ల వ్యవహారం పై హైకోర్టులో విచారణ సాగింది.

రాత్రి 10 దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టరాదని పబ్బులకు మరోసారి స్పష్టం చేసింది హైకోర్టు. గతంలో ఇచ్చిన ఆర్డర్ నే న్యాయస్థానం సమర్ధించింది. టాట్, జూబ్లీ 800, ఫర్జి కేఫ్, అమ్నెషియా, హై లైఫ్, డర్టీ మార్టిన్ కిచెన్, బ్రాడ్ వే, మాకో బ్రీవ్, హార్ట్ కప్, డైలీ డోస్ పబ్ లపై గతంలో ఇచ్చిన తీర్పునే సమర్ధించింది.

Read more RELATED
Recommended to you

Latest news