ఈనెల 13న ‘ఎంవీ గంగా విలాస్​’ నౌకను ప్రారంభించనున్న మోదీ

-

భారతదేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించటానికి కేంద్ర ప్రభుత్వం ఎంవీ గంగా విలాస్‌ నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ నౌక ప్రారంభోత్సవానికి ఇప్పుడు ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న గంగా విలాస్‌ను ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా ఇది హిస్టరీ క్రియేట్ చేయనుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ల పరిధిలోని అయిదు రాష్ట్రాల ద్వారా 27 నదీ మార్గాల్లో 3,200 కి.మీ.దూరం ఈ నౌక ప్రయాణిస్తుంది.

51 రోజుల పాటు కొనసాగే ప్రయాణంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ రేవులతో పాటు పట్నా, సాహిబ్‌గంజ్‌, కోల్‌కతా, గువాహటి, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వంటి నగరాల్లో ఈ నౌక మజిలీ చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. తొలి విడతలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది విదేశీ పర్యాటకులు ప్రయాణించనున్నారు. ఈ నెల 13న వారణాసి నుంచి బయలుదేరే ఎంవీ గంగా విలాస్‌ మార్చి మొదటి వారంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న దిబ్రూగడ్‌కు చేరుకుంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news