గ్రూప్‌-1 మెయిన్స్‌కు తండ్రీ కొడుకుల అర్హత

-

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల్లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి తండ్రీకొడుకులు మెయిన్స్‌కు అర్హత సాధించారుయ ఖమ్మం జిల్లా బోనకల్లుబోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేస్తున్న దాసరి రవికిరణ్‌(52), ఆయన కుమారుడు మైఖేల్‌ ఇమ్మాన్యుయేల్‌(24) ఇద్దరూ ఒకేసారి అర్హత సాధించటం విశేషం.

మైఖేల్‌ దూరవిద్య ద్వారా డిగ్రీ చేశారు. గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న కుమారుడికి సహకారం అందిస్తూ సందేహాలు తీరుస్తూ తండ్రి కూడా చదివారు. ఇద్దరూ ఒకేసారి పరీక్ష రాసి అర్హత సాధించారు. రిజర్వేషన్‌ కోటాలో అయిదేళ్లు, ఇన్‌సర్వీస్‌ కోటాలో అయిదేళ్ల మినహాయింపు ఉండటంతో 52 ఏళ్ల వయసులోనూ రవికిరణ్‌ గ్రూప్‌1 పరీక్షకు అర్హుడయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news