BREAKING : రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన దగ్గుబాటి

-

BREAKING : రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు దగ్గుబాటి పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తాను మరియు తన కుమారుడు హితేష్ రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో తాము ఇమడ లేమని, నిత్యం డబ్బుతో నడిచే రాజకీయాలు చేయలేనని స్పష్టం చేశారు దగ్గుబాటి. ప్రస్తుతం విలువలతో కూడిన రాజకీయాలు అసలు లేవని… రాజకీయాల్లో ఉండడం ఇప్పుడు కష్టమని తెలిపారు. తాను నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే… రాజకీయాలలో, లేకుండా ప్రజాసేవ చేస్తానని వెల్లడించారు. ఇక ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని… వెల్లడించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Latest news