నిజాం సంపదలను ప్రభుత్వం అమ్మేస్తోంది – రేవంత్ రెడ్డి

-

హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబు బర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకర్రం ఝా పార్తివదేహం టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి నిన్న హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. చవహర్లా ప్యాలెస్ లో సందర్శకుల కోసం చివరి నిజాం ముకర్రం పార్తివదేహాన్ని మంగళవారం సాయంత్రం ఉంచారు. హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్ధికి ముకర్రం ఝా పార్తివదేహానికి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం రాజులు సృష్టించిన సంపదను తెలంగాణ ప్రభుత్వం అమ్మేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news