‘సిటాడెల్‌’ సెట్లోకి సమంత.. కన్ఫమ్ చేసిన వరుణ్ ధావన్

-

మయోసైటిస్‌ వ్యాధి వల్ల గత కొన్ని నెలలుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాధపడుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొనడం లేదు. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా యాక్టివ్‌గా ఉండటం లేదు. షూటింగ్స్ నుంచి పూర్తి బ్రేక్ తీసుకుని కొన్నాళ్లుగా ఇంటిపట్టునే ఉంటోంది సామ్. చాలా నెలల తర్వాత సామ్‌ ఇప్పుడు మళ్లీ సెట్లోకి అడుగు పెట్టింది. ఆమె ప్రస్తుతం రాజ్‌-డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడు. ఈ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణ కోసం వరుణ్‌తో కలిసి ముంబయిలోని సెట్లోకి అడుగు పెట్టింది సామ్‌. ఈ విషయాన్ని వరుణ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ఇది హాలీవుడ్‌ షో ‘సిటాడెల్‌’కు రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో వరుణ్‌ ధావన్‌, సమంత గూఢచారి పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక సామ్‌, విజయ్‌ దేవరకొండ కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ చిత్రం వచ్చే నెల నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సమంత ఇప్పటికే డేట్లు కేటాయించిందని సమాచారం. మరోవైపు ఆమె నటించిన ‘శాకుంతలం’ వచ్చే నెల 17న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news