నాకు మళ్లీ టికెట్‌ రాకపోవచ్చు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

వైసీపీ అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల పని చేసినవాళ్లకే మళ్లీ టికెట్లు అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. పలువురు నేతలు నియోజకవర్గంలో నిర్లక్ష్యంగా ఉండటంపై కూడా క్లాస్‌ పీకినట్లు సమాచారం. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవచ్చని అన్నారు. బహుశా తన భార్య శచీదేవికి టికెట్ ఇస్తారేమోనని వ్యాఖ్యానించారు. నీకు సీటు లేదు… నీ భార్యకు ఇస్తాం అంటే చేసేదేమీలేదని పేర్కొన్నారు. మహిళలకు టికెట్ ఇస్తున్నప్పుడు నేనైనా తప్పుకోవాల్సిందే అని బాలినేని తెలిపారు.

కొండపి నియోజకవర్గంలో అశోక్ బాబు అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ నేతలు పార్టీ గెలుపు కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో బాలినేని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news