ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయి.. జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. ఈ యాత్ర ముగింపు సభను శ్రీనగర్‌లో ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. భారత్ జోడో పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు.

‘ఒక దశలో యాత్ర పూర్తిచేయగలనా అని అనుకున్నా? ప్రజల సహకారం చూసి కళ్లవెంట నీరు వచ్చింది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు తమ బాధలు నాతో పంచుకున్నారు. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తాం. నా పాదయాత్రలో ఎందరో దుస్తులు లేనివాళ్లను చూశాను. ప్రజల దీనస్థితి చూసే టీషర్టుతో యాత్ర చేయాలనుకున్నాను. కశ్మీర్‌ యాత్రలో భావోద్వేగానికి గురయ్యాను’ ’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news