పెళ్లింట విషాదం.. వధువు కుటుంబంపైకి స్కార్పియో దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

-

పెళ్లి పనులతో ఆ ఇళ్లంతా సందడిగా మారింది. కాసేపట్లో వచ్చే వరుడికి స్వాగతం పలికేందుకు వధువు కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే అంతులేని విషాదం జరిగింది. పెళ్లికుమారుడికి స్వాగతం పలికేందుకు రోడ్డుపక్కనే వేచి ఉన్న వధువు కుటుంబ సభ్యులపైకి ఓ స్కార్పియో వాహనం వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది.

మృతులను స్వప్న రెడ్డి(22), సంజు రెడ్డి(23), భారతి రెడ్డి(12)గా పోలీసులు గుర్తించారు. గోపాల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాండియాపల్లి వద్ద ప్రమాదం జరిగిందని వెల్లడించారు. వీరంతా కేశవ్ నగర్​కు చెందిన వారని తెలిపారు. ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news