మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ

-

మూడు రాజధానులపై క్లారిటీ ఇచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిలో బుధవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి లోనే అసెంబ్లీ ఉంటుందన్నారు. ఇక కర్నూల్ న్యాయ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యం అన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు.

ఎన్నికల కోసం తాము రాజకీయం చేయబోమని, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ విధానం అన్నారు. కొందరు కావాలనే ప్రజలను అయోమయం చేస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసం కొందరు వాదనలు చేస్తున్నారని.. ఎవరు అపోహలకు గురికావలసిన పనిలేదు అన్నారు సజ్జల. అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని, ఇచ్చిన అవకాశాన్ని వదులుకొని చంద్రబాబు ఘోర తప్పిదం చేశారని దుయ్యబట్టారు. మూడు రాజధానులపై మరింత మెరుగైన విధంగా చట్టం చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news