హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది – బండి సంజయ్

-

హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మంగళవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ బల్తీయాలో వెలుగులోకి వచ్చిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ వ్యవహారంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నకిలీ సర్టిఫికెట్లతో టెర్రరిస్టులు ఇక్కడే నివాసం ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఓ వర్గం ఓట్ల కోసం కొమ్ముకాస్తుందని, హైదరాబాద్ లో అక్రమంగా డెన్ ఏర్పాటు చేసుకొని ఉంటున్న వారిని ఇక్కడి నుండి తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధతకు ఇది నిదర్శనం అని.. సీఎం కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలని అన్నారు బండి సంజయ్

Read more RELATED
Recommended to you

Latest news