ఆస్కార్ ఈవెంట్ లో ఎన్టీఆర్ 30 పై తారక్ అప్డేట్..!

-

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం. గతేడాది మార్చి నెలలో విడుదలయ్యింది. అప్పటినుంచి ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూనే వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ గా నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆస్కార్ పొందిన ఈ సినిమా రికార్డు సృష్టించి భారతీయులకు గర్వకారణంగా నిలిచింది. అయితే ఆస్కార్ గెలుపు తర్వాత మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన అప్కమింగ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరైన శివ దర్శకత్వంలో #ఎన్టీఆర్ 30 చిత్రంలో నటిస్తున్నాను.మార్చి 29వ తేదీన షూటింగ్ ప్రారంభిస్తాము. ఆర్ ఆర్ ఆర్ మాదిరిగానే ఈ సినిమా కూడా మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుందని నమ్ముతున్నాను. నేను కూడా దానికోసమే చాలా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపారు ఎన్టీఆర్. నిజానికి ఎన్టీఆర్ థర్టీ మూవీ ఫిబ్రవరి నెలలోనే సెట్ పై కి వెళ్తుందని అంతా భావించారు. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. మరొకవైపు ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణం.. ఆ తర్వాత ఆస్కార్ అవార్డ్స్ కు హాజరు కావడంతో ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది.

అందుకే మార్చి 29వ తేదీ నుంచి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆస్కార్ వేడుకలలో కూడా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం గురించి వెల్లడించడంతో అభిమానులు పూర్తిస్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news