బిగ్‌బాస్‌లోకి టాప్ యాంక‌ర్ ఎంట్రీ..?

-

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్లో ఎందుకో గాని అంత‌గా ఆక‌ట్టుకోవ‌డం లేదు. తొలి రెండు సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్ పూర్తిగా తేలిపోయింద‌నే అంటున్నారు. ఇక షోకు క్రేజ్ తీసుకు వ‌చ్చేందుకు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశ‌పెట్టారు. అందులో ఒకరు ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కాగా మరొకరు యాంకర్ శిల్పా చక్రవర్తి. ఈ ఇద్దరు అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు.

తమన్నా సింహాద్రి కఠిన పదజాలం వాడటం మరియు ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె త్వరగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత కొంచెం అంచనాల మధ్య వైల్డ్ కార్డు ఇచ్చిన శిల్పా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. శిల్ప ఇంటి స‌భ్యులు ఎవ్వ‌రితోనూ స‌ఖ్య‌త‌తో లేదు. దీంతో ఆమె కూడా రెండు వారాల‌కే ట‌పా క‌ట్టేశారు.

అస‌లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఎలిమినేష‌న్ కోస‌మే తీసుకు వ‌స్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా బిగ్‌బాస్‌పై వ‌చ్చాయి. షోలో యాక్టివ్‌గా ఉండే ఆలీ రెజా, హిమ‌జ లాంటి వాళ్ల‌ను బ‌య‌ట‌కు పంపి… నీర‌సంగా ఉండే పున‌ర్న‌వి భూపాలం, వితిక లాంటి వాళ్ల‌ను ఎందుకు సేవ్ చేస్తున్నారు… విత‌క – వ‌రుణ్‌, రాహుల్ – పున‌ర్న‌వి జంట‌ల కోస‌మే వీరిని ఇంటిలో కంటిన్యూ చేస్తున్నార‌ని కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు షోను మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు మరో వైల్డ్ కార్డు ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తెలుగులో ప్రముఖ మేల్ యాంకర్స్ లో ఒకరైన రవిని హౌస్ లోకి పంపాలని భావిస్తున్నారట. దీనిపై ఎలాంటి క్లారిటీ లేక‌పోయినా, సోష‌ల్ మీడియాలో ఇది బాగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రి దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news