ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్ళరు – వినోద్ కుమార్

-

ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్ళబోరని తేల్చి చెప్పారు వినోద్ కుమార్. గతంలో మోడీ వచ్చినప్పుడు ఎవరిని వద్దని అన్నారు..కోవిడ్ సమయంలో ప్రోటోకాల్ ను పక్కన బెట్టింది మోడీనే..అప్పుడు కేసీఅర్ ను వద్దు అని మోడీ అన్నారో ఇప్పటి వరకు చెప్పలేదని వెల్లడించారు వినోద్ కుమార్.

తెలంగాణలో రాజకీయ అస్థిరత కు బిజెపి ప్రయత్నాలు చేస్తుందని సీరియస్‌ అయ్యారు. తెలంగాణ ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నది బిజెపి అని ఫైర్‌ అయ్యారు. అభివృద్ధి లో తెలంగాణ కు ఏ మాత్రం సాయం చేయడం లేదని తెలిపారు. రేపు కేంద్రం ఇచ్చే జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కు అని వెల్లడించారు వినోద్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news