నిరుద్యోగులకు అలర్ట్… డబ్బులిచ్చి మోసపోవద్దు : TSPSC

-

డిగ్రీలు చదువుకుని అర్హతలు ఉన్నా ఉద్యోగం రాని ఎందరో నిరుద్యోగులు చిన్న చిన్న నోటిఫికేషన్ లు పడినా ఎగబడి అప్లై చేస్తుంటారు. అయితే కొందరు నిరుద్యోగుల అవసరాన్ని వాడుకుని.. కొత్త కొత్త స్కీం లతో మోసకారులు బయటకు వస్తుంటారు. వీరి పనల్లా ఒక్కటే మీకు ఆ కంపెనీ లో జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇవ్వండి అని తీసుకుంటారు. తీరా డబ్బులు తీసుకున్నాక వారు మాయమైపోతుంటారు. అయితే ఈ సంస్కృతి ఇపుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా వచ్చేసింది.

ఏకంగా గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా మేము ఇప్పిస్తాము అంటూ కొందరు దళారులు అభ్యర్థుల వెనక పడుతున్నారు అట.. ఈ విషయాన్ని స్వయంగా TSPSC నిరుద్యోగులకు ఒక ప్రకటన ద్వారా చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరు డబ్బులు అడిగినా ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news