BREAKING: సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

-

ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాద్‌ కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి.. బీజేపీ నేతలు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళ్‌ సై.. ఆహ్వానించారు. ఈ తరుణంలో… సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్ వద్ద పోలీస్ అలెర్ట్ అయ్యారు.

ప్రధాని మోదీ పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న రూట్ మ్యాప్ వద్ద పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం… సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కు చేరుకున్న ప్రధాని మోడీ..వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించారు. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ.

Read more RELATED
Recommended to you

Latest news