తెలంగాణ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసహనం

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై వైయస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పు పై గతవారం స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. తాజాగా ముందస్తు బెయిల్ ను రద్దు చేసింది.

అంతేకాదు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు అపరిపక్వతతో బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా అసాధారణంగా స్పందించిందని నేటి తీర్పులో సిజెఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆక్షేపించింది. దర్యాప్తు గడువు ముగుస్తున్న సమయంలో ఇలా చేయడం వల్ల సిబిఐ పనితీరుకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news