ఐపీఎల్ 2023: షారుఖ్ ఖాన్ టీం KKR నేడు గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవం !

-

ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ కోల్కతాకు చావో రేవో .. ఇందులో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిందా ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటి వరకు కోల్కతా మొత్తం 10 మ్యాచ్ లు ఆడగా అందులో కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి 8 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో ఉంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్ కోల్కతాకు చివరి ఆశ అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ సహా యజమానిగా ఉన్న కోల్కతా టీం లో ఉన్నది అందరూ మ్యాచ్ విన్నర్లు అని చెప్పాలి. కెప్టెన్ నితీష్ రానా , జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, రింక్ సింగ్ మరియు రస్సెల్ లు ఉన్నారు.

వీరు అంతా అంచనాలకు అనుగుణంగా ఆడితే ఎటువంటి ప్రత్యర్థి అయినా కుదేలవ్వాల్సిందే. కానీ ఎందుకో దారుణంగా అందరూ ఫెయిల్ అయ్యి మ్యాచ్ లను ఓడిపోతున్నారు. ఈ రోజు మ్యాచ్ లో పంజాబ్ తో కోల్కతా గెలుస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news