కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తాం – నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకుంది. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాము సీఎం జగన్ లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదని.. కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామన్నారు.

ఇక అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్నింటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news