ప్రధాని మోదీ: కర్ణాటక అభివృద్ధికి మేమెప్పుడూ తోడుంటాం…

-

కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఏ పార్టీ అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ రోజు ఓట్ల లెక్కింపుకు ముందు కూడా సీఎం బసవరాజ్ బొమ్మై గెలిచేది మేమే అంటూ ప్రగల్భాలు పలికాడు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఫలితాలపై స్పందించారు. కర్ణాటక అసీంబ్లీ ఎన్నికలలో గెలిచి స్పష్టమైన మెజారిటీని సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. కాగా పార్టీతో సంబంధం లేకుండా కర్ణాటక రాష్ట్రానికి మేము అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటామని మోదీ చెప్పారు.

అంతే కాకుండా కర్ణాటక అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేశారు మోదీ. ఓడిపోయామని బాధ లోపల ఉన్నా మోదీ చేసిన ఈ కామెంట్స్ ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news