ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్టు తధ్యం – ఎంపీ రఘురామ

-

ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్టు తధ్యమని ఎంపీ రఘురామ సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారిని సీబీఐ పోలీసులు ఇవాళ అరెస్టు చేస్తారా?, అరెస్టు చేయకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందా?? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

ఇవాళ అవినాష్ రెడ్డి గారు సీబీఐ విచారణకు హాజరు అయినా కాకపోయినా ఆయన్ని అరెస్టు చేయడం తధ్యంగా కనిపిస్తోందని, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో తాను పిటిషన్ దాఖలు చేయాలని అనుకుంటున్నట్లుగా మెన్షన్ చేశారని, అవినాష్ రెడ్డి గారి అభ్యర్థనను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. బుధవారం పరిగణలోకి తీసుకుపోకపోవడం వల్ల శుక్రవారం కూడా లిస్టు అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితిలోనూ లేవని, పై వారంలో వచ్చినా ప్రయోజనం ఉండదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news