జగన్, భారతిలకు వివేకా హత్య గురించి ముందే తెలుసు – ఆదినారాయణ రెడ్డి సంచలనం

-

వివేకా హత్యపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్, భారతి, అవినాష్ రెడ్టిలకు వివేకా హత్య సమాచారం ముందే తెలుసు అని.. జగన్ కూడా బాబాయి హత్యలో అవినాష్ రెడ్టికి మద్దతు ఇస్తున్నారనేది అర్థం అవుతుందని ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులను అవినాష్ రెడ్టి ఒప్పుకుని సరెండర్ అవ్వాలని.. జగన్మోహన్ రెడ్డికి కూడా హత్య జరిగిన వెంటనే సమాచారం అందిందని తెలిపారు.

అజయ్ కల్లాం కూడా తెల్లవారు జామున జగన్ చెప్పిన విషయాన్ని‌ వెల్లడించారు…వివేకా హత్య జరుగుతుందని ముందుగానే జగనుకు తెలుసు అని వివరించారు. హత్య విషయం తెలిసే ఉదయం ఆ నలుగురితో సమావేశం పెట్టారు.. అన్నీ జగనుకు తెలిసే ఆ రోజు నా మీద అన్యాయంగా వార్తలు రాశారని వెల్లడించారు. వివేకా హత్యలో దోషులు తప్పించుకోలేరు…అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతికి తెలిసే హత్య జరిగిందని స్పష్టం చేశారు ఆదినారాయణ రెడ్డి. వాళ్లకు శిక్ష పడే వరకు వివేకానంద రెడ్డి ఆత్మ క్షోభిస్తూనే ఉంటుంది…జగనుకి, బిజెపి కి దగ్గర సంబంధాలు ఉన్నాయనేది అపోహ మాత్రమేనని చెప్పారు. జగన్ మాటల గారడీతో రాష్ట్రం సర్వ నాశనం అయ్యింది…జగన్ లాంటి వ్యక్తిని ఎవరూ వెనుకేసుకు రారని తెలిపారు ఆదినారాయణ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news