కుక్కల దాడిలో మరణించిన బాలుడికి రూ.లక్ష పరిహారం

-

కుక్కల దాడిలో మరణించిన బాలుడికి పరిహారం ప్రకటించారు. కుక్కల దాడిలో మరణించిన బాలుడి డెడ్ బాడీని పరిశీలించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తదితరులు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.లక్ష పరిహారం ప్రకటించారు మేయర్ గుండు సుధారాణి.

ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నాయని.. కుక్కలను చంపడం నేరం.. కానీ వాటి బర్త్ కంట్రోల్ చేస్తామని వెల్లడించారు. మరో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటి కి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీమ్ ను రప్పిస్తాం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి.

Read more RELATED
Recommended to you

Latest news