ఘాతుకం: అమ్మాయి గిఫ్ట్ తీసుకోలేదని గన్ తో కాల్చి చంపిన విద్యార్థి !

-

రోజురోజుకి గన్ కల్చర్ ప్రపంచంలోని విదేశాల నుండి మన దేశానికి పాకింది. ఇప్పుడు చాలామంది యువత ఏదో ఒక విధంగా గన్ ను వాడుతుండడం మనము చూస్తున్నాము. తాజాగా చెన్నై లోకి ఒక యూనివర్సిటీ లో జరిగిన ఘటన విద్యార్థులను కన్నా తల్లితండ్రులకు కునుకు లేకుండా చేస్తోంది అని చెప్పాలి. తెలుస్తున్న వివరాల ప్రకారం చెన్నై లోని శివనాడార్ యూనివర్సిటీ లో ఒక విఆద్యార్థి తన తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపేశాడు. అనుజ్ సింగ్ అనే విద్యార్థి తన సహా విద్యార్థిని స్నేహ చౌరాసియా కు గిఫ్ట్ ను ఇవ్వాలనుకుని .. ఆఫర్ చేశాడు, కానీ స్నేహ గిఫ్ట్ ను తీసుకోవడానికి నిరాకరించింది. అయితే ఇదే విషయంపై కొంతసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం మరియు తోపులాట జరిగి.. ఆ తర్వాత ఆగ్రహం చెందిన అనూజ్ సింగ్ ఆమెపై విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడని పోలీసులు నిర్దారించారు.

అయితే ఆమె చనిపోయిందని తెలుసుకున్న తర్వాత అనూజ్ సింగ్ కూడా తనకు తాను కాల్చుకున్నాడట. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news