పుష్ప-2 టీమ్ ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం

-

పుష్ప-2 టీమ్: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి జాతీయ రహదారి 65 పై ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సులు రహదారిపై నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది.

పోలీసులు రెండు బస్సులను రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుష్ప-2 సినిమా షూటింగులో పాల్గొని ఆ టెక్నీషియన్లతో వస్తున్న సింధూర ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.  ట్రావెల్ బస్సు నడుపుతున్న డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news