నా గుండె తరుక్కుపోతుంది – హీరోయిన్ రష్మిక

-

నా గుండె తరుక్కుపోతుందని టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక ఎమోషనల్‌ అయింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయక చర్యలు ముగిశాయి. ఇప్పటి వరకు 278 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 900 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ భయానక రైలు ప్రమాదం సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే సమయంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది.

14 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 13, 2009న ఒడిశాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. అయితే.. ఒడిస్సా రైలు ప్రమాద ఘటనపై నటి రష్మిక మందన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద వార్త వింటే గుండె తరుక్కుపోతుంది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news