రాజ్య సభ లో టిఆర్ఎస్…BRS గా పేరు మార్పు

-

రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం అధికారిక బులిటెన్ విడుదల చేసింది. రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీ నేతగా కేశవరావు ఉన్నారని తెలిపింది రాజ్యసభ.

ఈ సందర్భంగా అన్ని పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, పార్టీల వారీగా సభ్యుల సంఖ్యను రాజ్యసభ ప్రకటన చేసింది. గత సంవత్సరం అక్టోబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ఆ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ విషయాన్ని రాజ్యసభ కూడా ధ్రువీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news