చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు – మంత్రి జోగి రమేష్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ప్రతి చోటా శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు. స్టూడెంట్ అమర్నాథ్ హత్య దురదృష్టకరమని తెలిపారు. ఎవరి ఇంట్లోనూ ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలను ఓదార్చాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని.. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అమర్నాథ్ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చామని చెప్పారు.

jogi ramesh

ఇక నిందితులను 24 గంటలలోనే అరెస్టు చేశామని పేర్కొన్నారు. చంద్రబాబుకు మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఇక ఆటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ముద్రగడ లేఖ పవన్ కళ్యాణ్ చదివితే ఈ రాష్ట్రం నుండి పారిపోతాడని అన్నారు. ముద్రగడ బాధ్యత గల వ్యక్తి కనుక ముఖ్యమైన అంశాలు లేఖలో రాశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news