వాళ్ల ప‌నితో నంద‌మూరి ఫ్యాన్స్ డిజప్పాయింట్‌

-

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ టాప్ ప్రొడ‌క్ష‌న్ అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. అస‌లు ఈ బ్యాన‌ర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచే వ‌రుస‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్టింది. శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – రంగస్థలం వంటి బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్స్ తో టాలీవుడ్ లో మైత్రి మూవీస్ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ఈ సంస్థ కొన్ని ఎదురు దెబ్బ‌లు కూడా తింది.

ఇక ఈ సంస్థ‌కు చెందిన ఎర్నేని న‌వీన్ గ‌తంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుంద‌ని ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని కూడా వెల్ల‌డించారు. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ – మైత్రీ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. దీంతో నంద‌మూరి ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.

అలాగే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సైతం మైత్రీ వాళ్లు ఒక సినిమా ప్లాన్ చేశార‌ని… అడ్వాన్స్ కూడా ఇచ్చార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ప‌వ‌న్ పూర్తిగా రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు. మ‌ళ్లీ ఐదేళ్ల వ‌ర‌కు ఎన్నిక‌లు లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ తిరిగి సినిమాల్లోకి వ‌చ్చినా మ‌రో ముగ్గురు న‌లుగురు నిర్మాత‌ల‌కు క‌మిట్ అవ్వ‌డంతో మైత్రీ – ప‌వ‌న్ వాళ్ల సినిమా ఉంటుందా ?  ఉండ‌దా ? అన్న డౌట్లు ఉన్నాయి.

ఇక ఇప్పుడు మైత్రీ వాళ్లు అటు ఎన్టీఆర్‌తో పాటు ప‌వ‌న్ ప్రాజెక్టుల‌ను పూర్తిగా ఆలోచ‌న చేసే ప‌రిస్థితి కూడా లేదు. అకస్మాత్తుగా మైత్రి మూవీ మేకర్స్ అంతా కొత్త వారితో  ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయాదానికి సన్నాహాలు మొదలుపెడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news