బాలకృష్ణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్..!

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అందం అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్లు చాలా తక్కువగానే ఉంటారు. మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న కూడా ఆ తర్వాత నటనపై ఫోకస్ పెట్టి వరుస ఆఫర్లు అందుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆఫర్ల కోసం గ్లామర్ పాత్రలు, ఆ తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే ఒక నటి కాస్త ప్రత్యేకమని చెప్పాలి. అందం, అభినయంతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఎక్కువగా అర్థనగ్న సన్నివేశాలలో నటించి ఔరా అనిపించింది. తన మత్తు కళ్ళతో హొయలు పలికించి ఫిదా చేసింది.

అందుకే కుర్ర కారంతా ఆమె నామస్మరణ చేసేవారు. తెరపై కనిపించిందంటే చాలు మైమరిచిపోయి మరి థియేటర్లకే అతుక్కుపోయేవారు. కానీ కొన్ని విమర్శల కారణంగా ఆమె ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక ఆమె ఎవరో కాదు తేనెకళ్ళ సుందరి మందాకిని. తెలుగు సినిమాలలో కూడా కనిపించి కనువిందు చేసిన ఈమె మీరట్ లో పుట్టి తెరపైకి వచ్చింది. ఈమె అసలు పేరు యాస్మిన్ జోసెఫ్ ఠాకూర్.. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం , బాలకృష్ణతో భార్గవ రాముడు సినిమాలలో నటించిన ఈమె బ్రహ్మరుద్రుల్లో కూడా వెంకటేష్ తో ఒక ప్రత్యేక పాటలో నటించి మెప్పించింది.

1985- 96 మధ్యకాలంలో సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరమైన ఈమె మాజీ బౌద్ధ సన్యాసి డాక్టర్ కాగ్యూర్ టి. రింపోచే ఠాకూర్ ను నాగపూర్ లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఈమెకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జన్మించారు. ఇకపోతే సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈమె మా ఓ మా అంటూ తన కొడుకు రబ్బిల్ తో కలిసి ఒక ప్రైవేట్ సాంగ్లో కనిపించారు. ఇటీవల కపిల్ కామెడీ షో లో కూడా సందడి చేసిన ఈమె ఇప్పటికీ అదే అందంతో మెరిసిపోతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news